Allu Arjun Pushpa Part 1: అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ‘పుష్ప’ పార్ట్-1 చిత్రాన్ని 2021 క్రిస్మస్ కానుకగా విడుదల విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక. ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇది బన్నీ – సుకుమార్ లకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడటంతో డిసెంబరుకి వాయిదా వేశారు. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.