పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ‘వకీల్ సాబ్’ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక దీని తర్వాత వరుస సినిమాలకు పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్`ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు వహిస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్తో పాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. అయితే…నుంచి మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బిగ్బాస్ బ్యూటీ దివి నటించబోతుందట. మంచి రోల్ కావడంతో దివి ఈ ఛాన్స్కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందట. కాగా.. బిగ్బాస్-4 ఫినాలే కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కూడా దివికి సినిమా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు.