Unlock 5.0 Guidelines: మార్చ్ 22 నుంచి థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి. కరోనా వైరస్ కారణంగా వాటిని మూసేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్కు కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సెప్టెంబర్ 30తో నాలుగో దశ అన్లాక్ ముగుస్తున్న నేపథ్యంలో మరికొన్ని సడలింపులతో కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 5.0 మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. అయితే కేవలం 50 శాతం టికెట్స్ మాత్రమే అమ్ముకోవాలని కండీషన్ పెట్టింది. దానికి నిర్మాతలు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్, మాల్స్ అనే తేడా లేకుండా అన్నీ అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. అయితే కరోనా నిబంధనలు కూడా పక్కాగా పాటించాలని సూచించింది.