టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా ఉన్న సునీత ఈ రోజు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఆమె రెండో వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వార్తను నిజం చేస్తూ ఆమె ఈ రోజు ఉదయమే వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.
ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే ఆమె తెలుగు డిజిటల్ మీడియాలోని ఒక బిజినెస్ మాన్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు. కాగా చిన్న వయసులోనే సింగర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సునీత చిన్న వయసులోనే పెళ్లి కూడా చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమెకు భర్తకు పడకపోవడంతో ఆమె భర్త నుండి విడాకులు తీసుకున్నారు.
ఇక ఆమె వివాహం చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో వివాహం అని తెలుస్తోంది. కరోనా కారణంగా కేవలం రెండు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ ఉదయం శుభకార్యానికి హాజరయ్యారని సమాచారం అందుతోంది. అయితే ఇన్ని రోజులు బట్టి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నా సునీత స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని చాలా మంది భావించారు కానీ ఆమె వైపు నుంచి ఈ నిశ్చితార్థానికి సంబంధించి కానీ పెళ్లికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏకంగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇస్తుందేమో చూడాలి మరి.