సుప్రీం హీరో సాయి తేజ్ నటించిన తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్` క్రైసిస్ అనంతరం తొలి క్రేజీ చిత్రంగా థియేటర్లలో రిలీజైంది. ఇన్నాళ్లు గేట్లకు తాళం వేసి ఆడియన్స్ లేక వెలవెలబోయిన సినిమా థియేటర్స్లోకి ధైర్యంగా ఎంటరై నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది.
1వ రోజు అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. రెండో రోజు 3.29 కోట్లు వసూలు చేయగా.. మొదటిరోజు కంటే 30 శాతం తక్కువ వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. అదే జోష్ రెండో రోజు కూడా కనిపించడంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మరో హిట్ పడినట్టే అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ రెండు రోజుల్లో వసూళ్లు 7.99 కోట్లుగా నమోదయ్యాయి.
ఇక రెండో రోజు వసూళ్లను ఏరియా వారిగా చూసినట్లయితే..
నైజాం – 1.19 కోట్లు
సీడెడ్ – 59 లక్షలు
గుంటూరు – 26 లక్షలు
నెల్లూరు – 13 లక్షలు
కృష్ణా – 18 లక్షలు
వెస్ట్ గోదావరి – 15 లక్షలు
ఈస్ట్ గోదావరి – 24 లక్షలు
వైజాగ్ – 55 లక్షలు.