Rhea Chakraborty: ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రియా చక్రవర్తి.. ముంబై బైకుల్లో జైలులో ఉన్నారు. కోర్టు ఆమెకు సెప్టెంబరు 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (sushant singh rajput) మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ముంబై సెషన్స్ కోర్టులో షాక్ తగిలింది.
డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నాయని ఆధారాలు లభించడంతో నార్కోటిక్స్ అధికారులు రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం అప్లై చేసిన రియాకు కోర్టు నిరాకరించింది. బెయిల్ ఇచ్చేది లేదంటూ పిటిషన్ కొట్టేస్తూ షాకిచ్చింది ముంబై స్పెషల్ కోర్టు. రియాతో పాటు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తి, దీపేష్ సావంత్, శ్యామ్యూల్ మిరందా, డ్రగ్స్ వ్యాపారులు బాసిత్ పరిహార్, జైద్ విలాత్రా బెయిల్ అభ్యర్ధనలను కూడా కోర్టు తిరస్కరించింది.
డ్రగ్స్ కొనుగోలుపై ఈమె నిజాలు ఒప్పుకుంది. తాను డ్రగ్స్ కొన్నట్లు చెప్పడంతో ఇప్పుడు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్సీబీ విచారణలో లోపాలను ఎత్తిచూపుతూ తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా రియా చేసిన అభ్యర్థనను తాజాగా కోర్టు కొట్టిపారేయడంతో ఇక 14 రోజుల పాటు ఆమె జ్యుడిషియల్ కస్టడీ లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సెషన్స్ కోర్టు తీర్పుపై రియా లాయర్ హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు.
Once we get the order copy. We will decide next week on the course of action on approaching the High Court: Rhea Chakraborty’s lawyer Satish Maneshinde https://t.co/aRZNuuYtPG
— ANI (@ANI) September 11, 2020