anasuya bharadwaj: అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై యాంకర్గా, వెండితెరపై నటిగా ఆమె అద్భుతంగా రాణిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులకు, ఫాలోవర్లకు టచ్లో ఉంటున్నారు. వీటితో పాటు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువవుతున్నారు.
అనసూయ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోను అప్లోడ్ చేశారు. పార్టీలకు ఆమె ఎలా సిద్ధమవుతారో ఈ వీడియో ద్వారా అనసూయ చూపించారు. ప్రస్తుత కరోనా సమయంలో గుంపులుగా ఉండటం సరికాదని చెప్పిన అనసూయ.. తాము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీలో పాల్గొనబోతున్నామని వెల్లడించారు.
ఓ వైపు మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తూ సరదాగా కొన్ని విషయాలు మాట్లాడారు అనసూయ. తన ముఖంపై చాలా మచ్చలు ఉంటాయని, దగ్గరగా వచ్చి చూస్తే కనిపిస్తాయని అనసూయ అన్నారు. తన మేనత్తలకు, నానమ్మకు ఇలానే ఉండేవని చెప్పారు. తన చిన్న చెల్లికి అయితే మరీ భయంకరంగా ఉంటాయని అన్నారు.
దీనికి తోడు తన ముఖంపై ఎప్పుడైనా మొటిమ వస్తే గిచ్చేసుకుంటానని తెలిపారు. ముఖంపై ఉన్న మచ్చలన్నీ అవేనని అన్నారు. ఇది తనకున్న చెత్త అలవాటని అనసూయ వెల్లడించారు. కాకపోతే, తాను బీభత్సంగా ఆలోచిస్తూ గిచ్చేసుకుంటూ ఉంటానని.. తనకు తెలియకుండానే జరిగిపోతుందని అన్నారు. ఇంట్లో రెడీ అయ్యేటప్పుడు తాను అస్సలు దువ్వెన వాడనని అనసూయ చెప్పారు. ‘నా సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నా’ అంటూ ఒక్కో విషయాన్ని చెప్పుకొచ్చారామె.